అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం

Jun 10 2025 7:20 AM | Updated on Jun 10 2025 7:20 AM

అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం

అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం

భీమవరం (ప్రకాశం చౌక్‌): పీజీఆర్‌ఎస్‌ (మీకోసం) లో వచ్చిన అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలి జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గడువులోపు అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అర్జీల్లో కొన్ని..

● ఇరగవరం గ్రామానికి చెందిన వీరమనేని రమాదేవి, వీరమేని కృష్ణబాబు తమకున్న ఎకరా భూమిని ఆన్‌లైన్‌ చేయాలని, దీనిపై పలుమార్లు తహసీల్దార్‌ను కలిసి సమస్య పరిష్కారం కాలేదని అర్జీ అందజేశారు.

● పాలకోడేరు వివేకానంద కాలనీవాసులు తమ కాలనీలో సమీపంలో బోర్లు వేసి భూగర్భ జలాలను భారీ పైపులైన్ల ద్వారా రొయ్యల పరిశ్రమకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

● అత్తిలికి చెందిన పి.లక్ష్మి తాను కాలేయ సమస్యతో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నానని, ఇద్దరు పిల్లలతో జీవనం కష్టంగా మారిందని తనకు పింఛన్‌ అందించాలని వినతిపత్రం సమర్పించారు.

● దిరుసుమర్రు ఒకటో వార్డు వాసులు తమ ఇళ్లు పీకేసీ గతంలో గునుపూడి గ్రామంలో పట్టాలు ఇచ్చారని, అయితే ఇప్పటికీ స్థలాలు కేటాయించలేదని చర్యలు తీసుకోవాలని కోరారు.

● మొగల్తూరు మండలం ముత్యాలపల్లికి చెందిన డి.నాగేశ్వరరావు నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా పునరావాసం కల్పించేందుకు తనను ఎంపిక చేశారని, అయితే ఎటువంటి సహాయం అందలేదని, ఆర్థిక సాయం అందించాలని అర్జీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఓ కె.శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ఎస్‌ వేణుగోపాల్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, డీఎం సివిల్‌ సప్లయీస్‌ టి.శివరామ ప్రసాద్‌, డీఎంహెచ్‌ఓ జి.గీతాబాయి, మున్సిపల్‌ కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement