
రేపు వైఎస్సార్సీపీ జిల్లా సమావేశం
సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం పెదఅమిరంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు, ఏడాది పాలనలో ప్రజలకు చేసిన వంచనకు నిరసనగా జూన్ 4న ‘వెన్నుపోటు దినం’గా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారన్నారు. సీఎం చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై ఆ రోజు నిరసన తెలపనున్నట్టు ప్రసాదరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం ఉద యం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటుచేశామన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఇతర పెద్దలు సమావేశానికి హాజరువుతారన్నారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులు, నేతలు హాజరుకావాలని ప్రసాదరాజు కోరారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు వెల్లడి