ముగ్గురికి తీవ్ర గాయాలు
జంగారెడ్డిగూడెం/కొయ్యలగూడెం: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన పరశిన వీర నాగేశ్వరరావు, భార్య రమణమ్మ, కుమార్తె జాహ్నవి దేవి, కుమారుడు షణ్ముఖ్ రెడ్డితో కలిసి రాజమండ్రిలోని రమణమ్మ పుట్టింటికి వెళ్తున్నారు.
కొయ్యలగూడెం మండలం సీతంపేట సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి, అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. వీర నాగేశ్వరరావు(45)తో పాటు భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీర నాగేశ్వరరావు చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య, ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం నిమిత్తం రాజమండ్రి తరలించారు.
మట్టి ట్రాక్టర్ల స్పీడుకు వ్యక్తి మృతి
కై కలూరు: నిబంధనలకు విరుద్ధంగా వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టడంతో అతను చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. వివరాల్లోకి వెళితే కోరుకొల్లు గ్రామానికి చెందిన బుసనబోయిన సత్యనారాయణ(47) కలిదిండి నుంచి కోరుకొల్లు వెళ్తున్నాడు. సానారుద్రవరం వద్ద అక్రమ మైనింగ్ చేస్తున్న కాశీ విశ్వనాథం ట్రాక్టర్తో ఢీకొట్టి ఆపకుండా వెళ్ళాడు. బంధువులు అతన్ని భీమవరం, అక్కడ నుంచి విజయవాడ ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. మృతదేహన్ని కైకలూరు ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశాడు. అక్రమ మైనింగ్ చేస్తూ ట్రాక్టర్తో ఢీకొట్టడమే కాకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్లే సత్యనారాయణ మృతి చెందాడని, న్యాయం చేయాలని కై కలూరు ఆస్పత్రి ఎదురుగా పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిపై బంధువులు ధర్నా చేశారు. టౌన్ ఎస్సై డి.వెంకట్కుమార్ వారితో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. ట్రాక్టర్ డ్రైవర్ నుంచి నష్టపరిహారం బంధువులకు అందినట్లు సమాచారం. కలిదిండి ఎస్ఐను వివరణ కోరగా కేసు నమోదు చేసి, ట్రాక్టర్ను సీజ్ చేశామన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి