భీమవరంలో రకిటికల్‌ కేర్‌ యూనిట్‌ | - | Sakshi
Sakshi News home page

భీమవరంలో రకిటికల్‌ కేర్‌ యూనిట్‌

Mar 29 2025 1:12 AM | Updated on Mar 29 2025 1:10 AM

భీమవరం: భీమవరంలో అత్యవసర వైద్య సేవలందించడానికి క్రిటికల్‌ కేర్‌ ప్రత్యేక వైద్య విభాగం ఏర్పాటుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పథకంలో రూ.23.75 కోట్ల నిధులు మంజూరయ్యాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భీమవరం ఏరియా ఆస్పత్రిలో 50 పడకల క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు ఏప్రిల్‌లో శంకుస్థాపన చేస్తామన్నారు. అమృత భారత్‌ స్టేషన్‌ పథకంలో రాష్ట్రంలో 72 రైల్వే స్టేషన్లను గుర్తించగా వాటిలో భీమవరం, నరసాపురం తాడేపల్లిగూడెం స్టేషన్లకు సుమారు రూ.84 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. భీమవరం స్టేషన్‌లో ఇప్పటికే 55 శాతం పనులు పూర్తి చేసినట్టు చెప్పారు. నరసా పురం నుంచి నాగర్‌సోల్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు వీరవాసరంలో, వందే భారత్‌ రైలును మెయిన్‌ లైన్‌లో తాడేపల్లిగూడెంలో హాల్ట్‌ ఇవ్వడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆకివీడు–దిగమర్రు బైపాస్‌ రోడ్డు పనులు త్వరితగతిని చేపట్టేలా చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement