అక్రమంగా రేషన్‌ బియ్యం నిల్వ చేసిన వ్యక్తిపై కేసు | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా రేషన్‌ బియ్యం నిల్వ చేసిన వ్యక్తిపై కేసు

Mar 14 2025 12:45 AM | Updated on Mar 14 2025 12:44 AM

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు రూరల్‌ పరిధిలోని బీడీ కాలనీ చెరువుగట్టు పై ఎర్ర పూర్ణ కుమార్‌ అనే వ్యక్తి తన ఇంటిలో అక్రమంగా రేషన్‌ బియ్యం నిల్వ ఉంచడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం అందుకున్న తంగెళ్లమూడి–2 సచివాలయ వీఆర్‌ఓ అతని ఇంటిపై దాడి చేసి 310 కేజీల రేషన్‌ బియ్యాన్ని గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీజ్‌ చేసిన బియ్యం విలువ రూ.12,400 ఉంటుంది.

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని మహిళ మృతి

మండవల్లి: మోటూరు రైల్వే స్టేషన్‌ నుంచి మండవల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారిలో కిలోమీటరు నెంబరు 51–7–9 మధ్యలో ఓ గుర్తు తెలియన మహిళ మృతదేహాన్ని గురువారం ఆన్‌డ్యూటీ కీమెన్‌ గుర్తించాడు. రైలు నుంచి జారిపడి తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె మరణించినట్లు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిస్తే 94407 96570కు ఫోన్‌ చేయాలని గుడివాడ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement