అటవీ సిబ్బందిని అడ్డుకున్న గ్రామస్తులు | - | Sakshi
Sakshi News home page

అటవీ సిబ్బందిని అడ్డుకున్న గ్రామస్తులు

Mar 13 2025 12:58 AM | Updated on Mar 13 2025 11:19 AM

కై కలూరు: కొల్లేరు ఆపరేషన్‌లో భాగంగా చటాకాయిలో చెరువులకు గండ్లు కొట్టడానికి వెళ్లిన అటవీ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో 40 ఎకరాలు, 16 ఎకరాలు వెరసి 56 ఎకరాల్లో రెండు చెరువులను ధ్వంసం చేయాల్సి ఉంది. బుధవారం 9 మంది అటవీ సిబ్బంది చెరువులకు గండ్లు కొట్టడానికి చటాకాయి వెళ్లగా గ్రామస్తులు టెంట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. మా చెరువుల జోలికి వస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. కొల్లేరు ఆపరేషన్‌ సమయంలో కై కలూరు, మండవల్లి మండలాల్లో 7,500 ఎకరాలు అదనంగా ధ్వంసం చేశారని వాటిని ముందుగా పంపిణీ చేయాలని మెలిక పెట్టారు. దీంతో అటవీశాఖ అధికారులు చేసేది ఏమీలేక వెనక్కి మళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement