
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాసమస్యల శాశ్వత న్యాయపీఠం ఏలూరులో బుధవారం తొలితీర్పును వెలువరించినట్లు శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ తెలిపారు. 8లో u
అధునాతనంగా 108
సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధతో ఫుల్ లోడ్ హెడ్ 108 అంబులెన్స్లను తీసుకువచ్చారు. ఈ వాహనంలో ఆక్సిజన్, వెంటిలేటర్ వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. వాహనంలో మెడికల్ టెక్నీషియన్, వైద్య సిబ్బంది ఉంటారు. క్షతగాత్రులను, బాధితులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చేందుకు వీరి కృషి చేస్తున్నారు. తీవ్రమైన పరిస్థితుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్తో ప్రాణాలను నిలబెడుతున్నారు.
108 రకాలు.. సౌకర్యాలు
108 అంబులెన్సుల్లో నియోనాటల్, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్), బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్) అనే మూడు రకాలు ఉన్నాయి. నియోనాటల్ అంబులెన్స్ జిల్లాలో ఒకటి ఉంది. దీనిని 28 రోజుల వయసులోపు శిశువులను ఆస్పత్రికి తరలించేందుకు ఉపయోగిస్తారు. దీనిలో వెంటిలేటర్, ఇంక్యుబేటర్లు, చార్జ్ బ్లాంకెట్, ఆక్సిజన్ సౌకర్యాలు ఉన్నాయి. ఏ ఎల్ఎఎస్ అంబులెన్స్లో ఎలక్ట్రికల్ షాక్లు ఇచ్చే డిఫిల్లేటర్, వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యాలు ఉన్నాయి. బీఎల్ఎస్ అంబులెన్సుల్లో బీపీ పల్స్ రేట్ పరీక్షించే మానిటర్, సిరంజీ ఇన్ప్యూజన్, వాల్యూమ్ ఇన్ప్యూజన్ ఆక్సిజన్ సరఫరా ఉంటుంది.