హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్‌

Sep 28 2023 12:28 AM | Updated on Sep 28 2023 12:28 AM

నిందితులను పట్టుకున్న ఆగిరిపల్లి పోలీసులు  - Sakshi

నిందితులను పట్టుకున్న ఆగిరిపల్లి పోలీసులు

నూజివీడు (ఆగిరిపల్లి): హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్లు ఎస్సై నంబూరు చంటిబాబు చెప్పారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆగిరిపల్లి మండలం ఈదరలో గురజాల సంగీతరావుతో అదే గ్రామానికి చెందిన దేవరపల్లి రమేష్‌, దేవరపల్లి నవీన్‌లు ఈ నెల 24వ తేదీ రాత్రి రూ.4వేల అప్పు విషయమై గొడవపడి కత్తితో సంగీతరావును పొడిచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న సంగీతరావును విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చకిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి నిందితులిద్దరికీ రిమాండ్‌ విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement