అమ్మ పేరిట ఒక మొక్క నాటుదాం | - | Sakshi
Sakshi News home page

అమ్మ పేరిట ఒక మొక్క నాటుదాం

Jun 28 2025 5:22 AM | Updated on Jun 28 2025 9:00 AM

అమ్మ పేరిట ఒక మొక్క నాటుదాం

అమ్మ పేరిట ఒక మొక్క నాటుదాం

కమలాపూర్‌: అమ్మ పేరిట తలా ఒక మొక్క నాటుదామని నాబార్డ్‌ ఏజీఎం ఎల్‌.చంద్రశేఖర్‌, డీసీఓ బి.సంజీవరెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సహకార సంఘ వారోత్సవాల్లో భాగంగా కమలాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని గూడూరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి రైతులతో కలిసి సుమారు 77 మొక్కలు నాటారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరాన్ని సహకార సంఘాల సంవత్సరంగా ప్రకటించిందని, దీంతో ‘ఏక్‌ పేడ్‌ మా కీ నామ్‌’ నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రకృతి సమతుల్య త కోసం మొక్కలు నాటాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలంటే మొక్కల పెంపకం తప్పనిసరన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనల మేరకు రైతులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆడిట్‌ అధికారి కె.కోదండరాములు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అజహరుద్దీన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ పేరాల సంపత్‌రావు, డైరెక్టర్లు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, భావని రాజేశ్వర్‌రావు, మౌటం రమేశ్‌బాబు, కుమారస్వామి, ఏఓ రాజ్‌కుమార్‌, మాజీ ప్రజాప్రతినిధులు అంకతి సాంబయ్య, పాక లక్ష్మీరవీందర్‌, సంఘ కార్యదర్శి చోటేమియా, ఏఈఓలు, రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

నాబార్డ్‌ ఏజీఎం చంద్రశేఖర్‌, డీసీఓ సంజీవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement