ఆర్ట్స్‌ కాలేజీ ప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారిగా జితేందర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్ట్స్‌ కాలేజీ ప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారిగా జితేందర్‌

May 26 2025 1:07 AM | Updated on May 26 2025 1:07 AM

ఆర్ట్

ఆర్ట్స్‌ కాలేజీ ప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారిగా జితేందర్

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని యూని వర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారిగా ఆ కళాశాల కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎల్‌.జితేందర్‌ను నియమిస్తూ కళాశాల ప్రిన్సిపాల్‌ జ్యోతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. కళాశాలలో నిర్వహిస్తున్న ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం ద్వారా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం, వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కల్పన చేపట్టేందుకు ఈప్లేస్‌మెంట్‌ సెల్‌ అ ధికారి విధులు నిర్వర్తిస్తారన్నారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్‌ జ్యోతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ రెహమాన్‌ నియమాక ఉత్తర్వులను జితేందర్‌కు అందించి అభినందించారు.

‘కలం ధార’.. సామాజిక

అంశాల కలబోత

ఆచార్య బన్న అయిలయ్య

విద్యారణ్యపురి: సామాజిక అంశాల కలబోత ‘కలం ధార’ కవితా సంపుటి అని కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ బన్న అయిలయ్య అన్నారు. తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యాన కవి నక్క కుమారస్వామి రచించిన ‘కలం ధార’ కవితా సంపుటిని ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ ప్రైమరీ పాఠశాలలో ఆవిష్కరించారు. తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో బన్న అయిలయ్య మాట్లాడుతూ.. కుమారస్వామి కవిత్వంలో వస్తువైవిధ్యం బాగుందన్నారు. డీఆర్‌ఓ మేన శ్రీను మాట్లాడుతూ కవి.. వృత్తిపట్ల నిబద్ధతతో పాటు సామాజిక దృక్పథాన్ని కలిగి ఉండడం సంతోషంగా ఉందన్నారు. కవి, రచయిత జర్నలిస్టు నాగబెల్లి జితేందర్‌, కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్‌, యువకవి కార్తీకరాజు, బందెల భద్రన్న, వల్లంపట్ల నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా కల్యాణోత్సవం

హన్మకొండ కల్చరల్‌: మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వర, రుద్రేశ్వరీ అమ్మవార్లకు మాస కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఆదివారం 50 వేల మంది భక్తులు రుద్రేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పూజారులు మణికంఠ శర్మ, సందీప్‌ శర్మ, శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కొనసాగుతున్న

ఇంటర్‌ పరీక్షలు

విద్యారణ్యపురి: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఫస్టియర్‌ పరీక్షకు 6,759 మంది విద్యార్థులకు 6,262 మంది(93శాతం), మధ్యాహ్నం సెకండియర్‌ పరీక్షకు 2,944 మందికి 2,820 మంది(96శాతం) హాజరైనట్లు డీఐఈఓ గోపా ల్‌ తెలిపారు. వరంగల్‌ జిల్లాలో ఫస్టియర్‌ పరీక్షకు 1,333 మందికి 1,244 మంది, మధ్యాహ్నం సెకండి యర్‌ పరీక్షకు 740 మంది విద్యార్థులకు 706 మంది హాజరైనట్లు డీఐఈఓ శ్రీధర్‌సుమన్‌ తెలిపారు.

ఆ టీచర్లు స్క్రూటినీకి

హాజరుకావాలి

విద్యారణ్యపురి: బెస్ట్‌ ప్రాక్టీస్‌కు ఎస్‌సీఈ ఆర్టీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు చేసుకున్న ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు ఈనెల 26న పెద్ద పెండ్యాలలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహించనున్న స్క్రూటినీకి హాజరు కావాలని హనుమకొండ డీఈఓ వాసంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ పాఠశాలల్లో వినూత్నంగా విద్యాబోధన ఇతర కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఎస్‌సీఈఆర్టీ వెబ్‌సైట్‌ ద్వారా 39 మంది ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు పీపీటీ, ఆడియో విజువల్‌ డెవలప్‌మెంట్‌ సమాచారం ఇతర మెటీరియల్‌తో హాజరుకావాలని కోరా రు. ఉపాధ్యాయులకు సంబంధించి బెస్ట్‌ ప్రాక్టీస్‌లో మూడింటిని ఎంపిక చేసి పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.

ఆర్ట్స్‌ కాలేజీ ప్లేస్‌మెంట్‌ సెల్‌  అధికారిగా జితేందర్1
1/2

ఆర్ట్స్‌ కాలేజీ ప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారిగా జితేందర్

ఆర్ట్స్‌ కాలేజీ ప్లేస్‌మెంట్‌ సెల్‌  అధికారిగా జితేందర్2
2/2

ఆర్ట్స్‌ కాలేజీ ప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారిగా జితేందర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement