ఎలక్ట్రిక్‌ బస్సుల రాకతో కండక్టర్ల కొరత.. | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ బస్సుల రాకతో కండక్టర్ల కొరత..

May 26 2025 1:07 AM | Updated on May 26 2025 1:07 AM

ఎలక్ట్రిక్‌ బస్సుల రాకతో కండక్టర్ల కొరత..

ఎలక్ట్రిక్‌ బస్సుల రాకతో కండక్టర్ల కొరత..

అలాగే.. వరంగల్‌ రీజియన్‌కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయించింది. ఈ క్రమంలో కండక్టర్ల లోటు భారీగా ఏర్పడింది. దీనికి తోడు రీజియన్‌లో ఆర్టీసీకి చెందిన సొంత బస్సులు 417 మాత్రమే ఉండగా.. అద్దె బస్సులు 310 ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రయివేట్‌ సంస్థ జేబీఎం ఆపరేట్‌ చేస్తున్నది. జేబీఎం ఎలక్ట్రిక్‌ బస్సులు, అద్దె బస్సులు కలిపి 422 ఉన్నాయి. ఆర్టీసీ సొంత బస్సుల్లో కండక్టర్ల కొరతను అధిగమించేందుకు డ్రైవర్లకు టిమ్‌లు ఇచ్చి టికెట్‌ జారీ చేయిస్తూ బస్సులను నడుపుతోంది. ప్రయివేట్‌ బస్సుల డ్రైవర్లకు టికెట్‌ జారీ చేసేందుకు టిమ్‌లు ఇవ్వలేదు. అయితే.. కండక్టర్ల కొరత నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ బస్సు డ్రైవర్లకు మాత్రం టిమ్‌లు ఇచ్చి టికెట్లు జారీ చేయిస్తున్నారు. ఆర్టీసీకి ప్రధాన ఆదాయం టికెట్ల ద్వారానే వస్తుంది కాబట్టి.. ప్రయివేట్‌ డ్రైవర్లకు అప్పగించేందుకు సిద్ధంగా లేని యాజమాన్యం తాత్కాలికంగా ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో కండక్టర్ల నియామకానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వరంగల్‌ రీజియన్‌కు అత్యవసరంగా 100 మంది కండక్టర్లను నియమించనున్నారని, అవసరాన్ని బట్టి మరికొంత మందిని నియమించే ఆలోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్‌ నియామకాలకు ఆలస్యం అవుతుండడంతో తాత్కాలికంగా సమస్య నుంచి గట్టెందుకు ఔట్‌ సోర్సింగ్‌ వైపు ఆర్టీసీ మళ్లిందని, తర్వాత రెగ్యులర్‌ నియామకాలు చేపట్టే అవకాశముందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఔట్‌ సో ర్సింగ్‌లో విజయవంతమైతే పూర్తి స్థాయి నియామకాలను పట్టించుకుంటారా లేదా? అనే సందేహాలు ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement