అమెరికా సభకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

అమెరికా సభకు ఆహ్వానం

May 26 2025 1:06 AM | Updated on May 26 2025 1:06 AM

అమెరి

అమెరికా సభకు ఆహ్వానం

నర్సంపేట: బీఆర్‌ఎస్‌ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభను జూన్‌ 1వ తేదీన అమెరికా డల్లాస్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో హాజరు కావాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో రజతోత్సవ సభలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం వస్తుందని తెలిపారు.

వైభవంగా రుద్రేశ్వరస్వామి మాస కల్యాణోత్సవం

హన్మకొండ కల్చరల్‌: మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వర, రుద్రేశ్వరీ అమ్మవార్లకు మాస కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో కల్యాణం నేత్రపర్వంగా కొనసాగింది. ఈసందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి పుష్పరాల సందర్భంగా ఆదివారం సుమారు 50 వేల మంది భక్తులు రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మణికంఠ శర్మ, సందీప్‌ శర్మ, శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కొనసాగుతున్న

ఇంటర్‌ పరీక్షలు

విద్యారణ్యపురి: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. వరంగల్‌ జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 1,333 మందికి 1,244 మంది హాజరవ్వగా.. 89 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. మధ్యాహ్నం 740 మంది విద్యార్థులకు 706 మంది హాజరవ్వగా 34 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. హనుమకొండ జిల్లాలో ఆదివారం ఉదయం నిర్వహించిన ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 6,759 మంది విద్యార్థులకు 6,262 మంది (93శాతం) హాజరయ్యారు. 497 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్‌ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 2,944 మందికి 2,820 మంది (96శాతం) హాజరుకాగా... వారిలో 124 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

ఆర్ట్స్‌ కాలేజీ ప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారిగా జితేందర్‌

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారిగా ఆ కళాశాల కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎల్‌.జితేందర్‌ను నియమిస్తూ ఆకళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌.జ్యోతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. కళాశాలలో నిర్వహిస్తున్న ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం ద్వారా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం, వివిధ కంపెనీల్లో ఉద్యోగ కల్పన చేపట్టేందుకు ఈప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారి విధులు నిర్వర్తిస్తారన్నారు. ప్రిన్సిపాల్‌ జ్యోతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ రెహమాన్‌ నియామక ఉత్తర్వులను జితేందర్‌కు అందించి అభినందించారు.

‘కలం ధార’.. సామాజిక అంశాల కలబోత

ఆచార్య బన్న అయిలయ్య

విద్యారణ్యపురి : సామాజిక అంశాల కలబోత ‘కలం ధార’ కవితా సంపుటి అని కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ బన్న అయిలయ్య అన్నారు. కవి నక్క కుమారస్వామి రచించిన ‘కలం ధార’ కవితా సంపుటిని ఆదివారం హనుమకొండ ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ పాఠశాలలో ఆవిష్కరించారు.

అమెరికా సభకు ఆహ్వానం
1
1/2

అమెరికా సభకు ఆహ్వానం

అమెరికా సభకు ఆహ్వానం
2
2/2

అమెరికా సభకు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement