కరెంట్‌పనులు సొంతంగా చేయొద్దు.. | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌పనులు సొంతంగా చేయొద్దు..

May 26 2025 1:06 AM | Updated on May 26 2025 1:06 AM

కరెంట్‌పనులు సొంతంగా చేయొద్దు..

కరెంట్‌పనులు సొంతంగా చేయొద్దు..

పర్వతగిరి: విద్యుత్‌ సమస్యలు ఉంటే ప్రజలు సొంతంగా చేయకుండా సంబంధిత శాఖ సిబ్బంది సాయం తీసుకోవాలని ఏడీఈ తిరుపతి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాబోవు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్న సూచనమేరకు విద్యుత్‌ వినియోగదారులు, రైతులు విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రైతులు, వినియోగదారులు సొంతంగా విద్యుత్‌కు సంబంధించిన పనులు చేయకూడదని తెలిపారు. ఇబ్బందులు ఉంటే టీజీఎన్పీడీసీఎల్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912 ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. ఇళ్లలో దుస్తులు ఆరవేసే దండెముగా ఇనుప తీగలు వాడొద్దని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పశువుల యజమానులు మేతకు తీసుకెళ్లినప్పుడు కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇంటి వైరింగ్‌కు సరైన ఎర్తింగ్‌ చేయించి నాణ్యమైన ప్లగ్గులు, సెల్‌ ఫోన్‌ చార్జర్లను ఉపయోగించాలన్నారు. ఎవరైనా విద్యుత్‌ కంచెలు ఏర్పాటు చేస్తే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. మోటారు రిపేరు అర్హత గల ఎలక్ట్రిషియన్‌తో రిపేర్లు చేయించాలని, వ్యవసాయ మోటార్లకు, గృహాల్లో నాణ్యతగల, అతుకులు లేని సర్వీస్‌ వైరును మాత్రమే ఉపయోగించాలని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement