స్కానింగ్‌ సెంటర్లపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

స్కానింగ్‌ సెంటర్లపై దృష్టి సారించాలి

May 21 2025 1:03 AM | Updated on May 21 2025 1:03 AM

స్కానింగ్‌ సెంటర్లపై దృష్టి సారించాలి

స్కానింగ్‌ సెంటర్లపై దృష్టి సారించాలి

న్యూశాయంపేట: లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్‌ సెంటర్లపై దృష్టి సారించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయకుండా కమిటీ సభ్యులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. డీపీఆర్‌ఓ ఆధ్వర్యంలో కళాబృందాలతో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. పీసీపీ ఎన్టీడీ యాక్ట్‌ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాకోర్టు చీఫ్‌ ఏఓ కోట్ల రాధాదేవి మాట్లాడుతూ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారిని శిక్షించడానికి కోర్టులు సహకరిస్తాయని తెలిపారు. డీసీపీ అంకిత్‌కుమార్‌ సంకాల్వే, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, వరంగల్‌ ఏసీపీ నందిరాంనాయక్‌, మామునూరు ఏసీపీ తిరుపతి, నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, పీపీ సంతోషి, ప్రోగ్రాం ఆఫీసర్‌ ఆచార్య, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్‌, సీఐ వెంకన్న, ఎన్జీఓ ప్రతినిధి పరశురాములు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి అధికారులు సిద్ధం

సమస్యల పరిష్కారానికి పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ విజిలెన్స్‌ కమిటీ సమావేశం జరి గింది. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, అత్యాచార కేసుల పరిహారం చెల్లింపు, ఇతర సమస్యలపై కలెక్టర్‌ సత్యశారద సమీక్షించారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఎస్సీ కార్పొరేషన్‌ అఽభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీఓలు ఉమారాణి, ఏసీపీలు నందిరాంనాయక్‌, తిరుపతి, రవీందర్‌రెడ్డి,పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సంతోషి, కమిటీ సభ్యులు బిర్రు మహేందర్‌, మహంకాళి యాదగిరి, పాలకుర్తి విజయ్‌కుమార్‌, భూక్యా హుస్సేన్‌నాయక్‌ పాల్గొన్నారు.

రక్తనిధి నిర్మాణానికి హామీ

గవర్నర్‌ ప్రధాన కార్యదర్శి దానకిశోర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకు (రక్తనిధి) నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యత్వం, సొసైటీ ఎన్నికల నిర్వహణ, రక్తనిధి కేంద్రం నిర్మాణ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సభ్యత్వం, యూత్‌ రెడ్‌క్రాస్‌, జూనియర్‌ రెడ్‌క్రాస్‌ కార్యకలాపాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యుడు ఈవీ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సమీక్షలో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement