వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి లోని 13 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం సంబంధిత మంత్రులను కోరారు. గత ప్రభుత్వ హయాంలో తండాలను మున్సిపాలిటీలో విలీనం చేసిందన్నారు. ఆయా తండావాసులు గ్రామపంచా యతీలుగా మార్చాలని కోరుతున్నట్లు చెప్పా రు. అదేవిధంగా మండలంలోని బొక్కలగూడెం గ్రామ పంచాయతీ పేరు మార్చాలని కోరగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెంట నే స్పందించి వెంకట్రావుపల్లెగా మార్చిందన్నా రు. దీంతో ఎమ్మెల్యే నాగరాజు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
పల్లె ప్రకృతివనం
మొక్కలకు నీరు
దుగ్గొండి: మండల కేంద్రంలోని పల్లె ప్రకృతివనంలోని మొక్కలకు అధికారులు నీరు పోసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. స్థానిక పల్లె ప్రకృతివనంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోయింది. దీంతో ఈ నెల 23న ‘కాలిపోయిన పల్లె ప్రకృతివనం’ పేరుతో కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీంతో స్పందించిన ఎంపీఓ శ్రీధర్గౌడ్ సోమవారం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. మొక్కల చుట్టూ పాదులు తీయించి నీరు పోయించారు. పూర్తిగా చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు పెట్టించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కారోబార్ రాంబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సయ్య, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాకు
అంతరాయం
నర్సంపేట: విద్యుత్ సరఫరాకు నేడు (మంగళవారం) అంతరాయం ఉంటుందని విద్యుత్ న ర్సంపేట డీఈ తిరుపతి, చెన్నారావుపేట వి ద్యుత్ ఏఈ జోగానంద్లు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ 33కేవీ చెన్నారావుపేట, ఉప్పరపల్లి విద్యుత్ లైన్లలో మరమ్మతు కారణంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.33/11కేవీ అమీనాబాద్, 33/ 11కేవీ ఉప్పరపల్లి ఉప కేంద్రాల్లోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఎంజీఎంలో ఇన్చార్జ్
ఆర్ఎంఓల నియామకం
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఇద్దరు ఇన్చార్జ్ ఆర్ఎంఓలను నియమించారు. ఆస్పత్రికి కొంతకాలంగా పూర్తిస్థాయి ఆర్ఎంఓలు లేకపోవడంతో పేరుకుపోయిన సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయి అఽధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టర్ సత్యశారద ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా కొనసాగుతున్న డాక్టర్ అంబి శ్రీనివాస్ను సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా, డాక్టర్ శశికుమార్ను డిప్యూటీ సివిల్ సర్జన్గా నియమిస్తూ డీఎంఈ డాక్టర్ ఎ.నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సూపరింటెండెంట్ ఆదేశాలతో కొనసాగుతున్న ఆర్ఎంఓలైనా డాక్టర్ శ్రీనివాస్, శశికుమార్లకు సివిల్ ర్జన్ ఆర్ఎంఓగా, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓలుగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వీరి నియామకంపై వైద్యులు, వైద్యసిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
విద్యారణ్యపురి: పదవ తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం హనుమకొండ జిల్లాలో 67కేంద్రాల్లో ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించగా 11,994మంది విద్యార్థులకుగాను 11,987మంది హాజరుకాగా, ఏడుగురు గైర్హాజరయ్యారని డీఈఓ వాసంతి తెలిపారు. వరంగల్ జిల్లాలో 49కేంద్రాల్లో 9,221మంది విద్యార్థుకుగాను 9,208 మంది హాజరుకాగా, 13మంది గైర్హాజరయ్యారని సంబంధిత జిల్లా అధికారులు తెలిపారు.