-IIలోu
దేవాదుల పథకంలో భాగంగా మరి కొందరు రైతుల నుంచి భూమి సేకరించి 1,900 ఎకరాలతో చెరువును రిజర్వాయర్గా మార్చారు. దీంతో తమ పొలాలకు సాగు నీరు సమృద్ధిగా అందుతుందని ఆయకట్టు రైతులంతా భావించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలించుకుపోతున్నారు కానీ.. స్థానిక రైతులకు మాత్రం చుక్క నీరు రానివ్వడం లేదని స్థానిక రైతులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. గత నిజాం ప్రభుత్వం కాలంలో ధర్మసాగర్ చెరువు కట్టపై నక్కలతూము నిర్మించి కాలువ ద్వారా దాదాపు 2 వేల ఎకరాలకు సాగు నీరందించేవారు. ఈక్రమంలో 1939 నాటి ప్రభుత్వం నక్కల తూము నీటి సరఫరా నిలిపేసి, చెరువు నుంచి నీటిని వరంగల్ నగర ప్రజల దాహార్తి తీర్చడానికి తరలిస్తున్నారు. అదేవిధంగా కట్టపై గతంలో నిర్మించిన చోటనే 6 సంవత్సరాల క్రితం అరకోటికిపైగా నిధులు వెచ్చించి నక్కలతూమును పునర్నిర్మించారు. కానీ కాలువ పునర్నినిర్మాణం మరిచారు. కాగా.. బోడబండ శివారు నుంచి రిజర్వాయర్ వరకు పైపులైన్ వేశారు. ఆపైపులైన్ ఎయిర్వాల్వ్ ద్వారా రైతుల పొలాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఆ రైతులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్లైన్ ఎయిర్వాల్వ్ ద్వారా నీటిని విడుదల చేస్తే నక్కలతూము కాలువ ద్వారా నీళ్లు వచ్చి తమ పంట పొలాలు పారుతాయని లేకపోతే ఉన్న పొలాలన్నీ ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దిశగా అధికారులు ఆలోచిస్తారా.. పంటలు నిలువునా ఎండిపోతున్నా చూస్తుండిపోతారా అన్నది వేచి చూడాల్సిందే..
వరిపంట మేస్తున్న మూగజీవాలు
ఎండిపోయిన వరిచేను
నీరు విడుదల చేయాలి..
నేను బోడబండ శివారులో 8 ఎకరాల్లో 5 లక్షలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేశాను. సరిపడా సాగు నీరందక పంట ఎండుతుంది. దీంతో అందులో మూడెకరాల వరిలో మూగజీవాల్ని మేపుతున్నా. బోడ బండ శివారు నుండి రిజర్వాయర్ వరకు వేసిన పైప్లైన్ ఎయిర్ వా ల్వ్ ద్వారా నీటిని విడుదల చేసినా పొలాలు ఎండిపోకుండా ఉంటాయి. అధికారులు స్పందించి ఎయిర్వాల్ నుంచి నీటిని విడుదల చేయాలి.
– తోకల విజయపాల్ రెడ్డి, ధర్మసాగర్ రైతు
నీరుగారిన ఆశలు..
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025