శాయంపేట : మండలంలోని ప్రగతిసింగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పోతు సుమలత భర్త రమణా రెడ్డి తనకు సుమారు రూ.12లక్షలు ఇవ్వాలంటూ అదే గ్రామానికి చెందిన మూలగుండ్ల సందీప్ రెడ్డి వాట్సాప్ గ్రూప్ల్లో మెసేజ్ పోస్ట్ చేశాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కాగా, రమణారెడ్డి భార్య సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కాంట్రాక్ట్ పనుల కోసం సందీప్ రెడ్డి వద్ద డబ్బులు తీసుకున్నాడని, సర్పంచ్ పదవి అయిపోయినా రమణారెడ్డి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సందీప్రెడ్డి పలు వాట్సాప్ గ్రూప్లలో మెసెజ్ పెట్టాడు.
భర్తకు సర్దిచెప్పిన భార్య అనూష
సందీప్ రెడ్డి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసిన విషయం తెలుసుకున్న అతని భార్య అనూష తనభర్తకు ఫోన్ చేసి డబ్బులు ఈరోజు కాకపోతే రేపు వస్తాయని, నీవు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా ఇంటికి రావాలని సర్దిచెప్పింది. కాసేపటి తర్వాత సందీప్రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనూష తమ బంధువులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు పోలీసులకు తెలపడంతో ఎస్సై జక్కుల పరమేష్ హుటాహుటినా సందీప్రెడ్డి ఫోన్ నంబర్ను ట్రేస్ చేశారు. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల మూలతాళ్లవద్ద ఉన్నాడని గుర్తించి, అక్కడికి చేరుకోగా సందీప్రెడ్డి పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం