
కొమ్మాల జాతర షురూ..
గీసుకొండ: బండ్లు తిరిగే కార్యక్రమంతో శుక్రవారం మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. రాజకీయ ప్రభబండ్ల రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడి భక్తులు, అంబులెన్స్లలోని రోగులకు ఇక్కట్లు తప్పలేదు. కాంగ్రెస్ ప్రభను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, బీఆర్ఎస్ ప్రభను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీజేపీ ప్రభను డాక్టర్ కాళీప్రసాదరావు ప్రారంభించారు.
విద్యుత్ దీపాల వెలుగుల్లో కొమ్మాల జాతర ప్రాంగణం (ఇన్సెట్లో) నర్సింహస్వామివారు

కొమ్మాల జాతర షురూ..