ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన

Mar 15 2025 1:24 AM | Updated on Mar 15 2025 1:25 AM

కాళోజీ సెంటర్‌: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధస్సు)తో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలో 11 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఏఐ సహకారంతో వర్చువల్‌ రియాల్టీ విధానంలో పాఠాలు చెప్పేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచే లక్ష్యంగా శనివారం నుంచి పాఠశాలల్లో ఏఐ బోధన ప్రారంభించనుంది. ఎఫ్‌ఎల్‌ఎన్‌కు సాంకేతికత జోడించి ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీలకు శిక్షణ ఇచ్చారు.

3, 4, 5 తరగతుల విద్యార్థులకు..

ఏఐ బోధనలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులు మెరుగైన అభ్యసన సామర్థ్యాలను సాధించేవిధంగా కృషిచేస్తారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఆకట్టుకునేలా బోధిస్తారు. ఎంపిక చేసిన విద్యార్థుల్లో తొలుత డిస్కవరీ లెవల్లో భాషలు, గణిత అంశాలపై ఉన్న అభ్యసన సమస్యలను గుర్తిస్తారు. అందుకనుగుణంగా వివిధ కృత్యాలు, అభ్యాసాలను ఇస్తారు. ఆ తర్వాత ఆయా స్థాయిల వారికి తగిన విధంగా బోధన చేస్తారు. ఎంపికచేసిన పాఠశాలల్లో ఏఐ బోధన ప్రారంభించేలా సంబంధిత ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, పాఠశాలల హెచ్‌ఎంలకు సూచనలు చేశారు.

నేటి నుంచి ఏఐ బోధన..

జిల్లాలో ఎంపికై న 11 ప్రాథమిక పాఠశాలల్లో శనివారం నుంచి ఏఐ డిజిటల్‌ బోధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ బోధన అందుబాటులోకి తేవడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా జిల్లాలో కూడా ప్రారంభిస్తాం.

– మామిడి జ్ఞానేశ్వర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

18, 19 తేదీల్లో జాతీయ సదస్సు

కేయూ క్యాంపస్‌: కేయూలోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో ఈనెల 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ‘75 ఇయర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌–మైల్‌ స్టోన్స్‌ ఇష్యూస్‌ అండ్‌ చాలెంజెస్‌’ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు కేయూ ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement