హన్మకొండ అర్బన్: జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములను గురువారం బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జ్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, హైదరాబాద్ జేఎన్టీయూ రిటైర్డ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ పరిశీలించారు. అనంత రం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రావీణ్యతో సమావేశమై ఎక్స్టెన్షన్ క్యాంపస్ స్థాపనకు అవసరమైన భూమికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. క్యాంపస్ ఏర్పాటుకు తొలుత 50 ఎకరాల భూమి కావాలని ప్రతిపాదించగా.. భవిష్యత్ అవసరాలకు మరో 50 ఎకరాలు కేటాయించాలని కలెక్టర్ కు ప్రాథమిక ప్రతిపాదనలు చేశారు. వారి వెంట అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్రమేశ్, తహసీల్దార్ జగత్సింగ్ పాల్గొన్నారు.