నర్సంపేట: పరీక్షల సమయంలో విద్యార్థినులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దని ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ రవిశంకర్ సూచించారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థినులకు బుధవారం ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షల్లో ఎలా విజయం సాధించాలో వివరించారు. ఆత్మవిశ్వాసంతో ఉంటే దేనినైనా సాధించే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయినులు తేజస్విని, రజిని, పల్లవి, రాజ్యలక్ష్మి, యశోద తదితరులు పాల్గొన్నారు.