
రైతుకు చెక్కు అందిస్తున్న డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు
ఐనవోలు : నందనం సొసైటీ ఆధ్వర్యంలో అందిస్తున్న రుణాలను కర్షకులకు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్రావు సూచించారు. నందనం రైతు సేవా సహకార సంఘం (ఎఫ్ఎస్సీఎస్) ద్వారా రూ.41 లక్షల కర్షకమిత్ర మార్టిగేజ్ లోన్లను గురువారం ఐదుగురు రైతులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాంకు ద్వారా పంట, బంగారం తనఖా రుణాలతో పాటు వ్యవసాయ భూమి మార్టిగేజ్ రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. రైతు బంధు, రైతుబీమా, రుణమాఫీ లాంటి పథకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని పేర్కొన్నారు. సొసైటీలతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని వివరించారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి చందర్రావు, డైరెక్టర్ వడిచర్ల శ్రీనివాస్, సీఈఓ సంపత్ పాల్గొన్నారు.