
తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న గండ్ర జ్యోతి
శాయంపేట : గిరిజన సంస్కృతీసంప్రదాయలకు ప్రతీక తీజ్ పండుగ అని వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. సూర్యనాయక్ తండాలో గురువారం నిర్వహించిన తీజ్ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. గిరిజన యువతులు, మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ తీజ్ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ నిర్వహించే తీజ్లో పాల్గొననడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం అన్ని పండుగలకు సమప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అనంతరం గోధుమ బుట్టలతో ఊరేగింపు చేస్తున్న గిరిజన యువతులతో కలిసి ఆమె నృత్యం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాంశెట్టి లతాలక్ష్మారెడ్డి, సర్పంచ్ భూక్యా రమేష్, పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ మాలోత్ వస్త్రం, నాయకులు లౌడ్య రవీందర్, రెడ్యానాయక్, లింగ్యనాయక్, దేవ్సింగ్, జోహార్, రమేష్, రవీందర్ పాల్గొన్నారు.
వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి