
సమావేశంలో మాట్లాడుతున్న రమేష్
నర్సంపేట: బూర్జువా భూస్వామ్య పార్టీల ఎన్నికల హామీలకు మోసపోవద్దని, మద్దికాయల ఓంకార్ ఆశయ సాధనలో ముందుకు సాగాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని జ్యోతిబసునగర్లో గురువారం జనరల్ బాడీ సమావేశం బండారి మల్లేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. దేశంలో మహిళలకు రక్షణలేకుండా పోయిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఏర్పడిన చట్ట సభలను అవకాశవాద అవినీతి కర రాజకీయాలుగా మార్చారని ఆరోపించారు. కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులకు కట్టబెడుతూ అప్పులు మిగుల్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రమజీవుల కోసం పని చేసి అసెంబ్లీ టైగర్గా పేరుగాంచిన మద్దికాయల ఓంకార్ చూపిన మార్గంలో ప్రజలు పయనించాలన్నారు. కార్యక్రమంలో బీఎల్ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ వంగల రాగసుధ, పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు కుక్కల యాకయ్య, మోటం సురేష్, నా యకులు గడ్డం స్వరూప, ఈర్ల రాజు, సతీష్బాబు, సుభద్ర, మొగలి, దేవమ్మ, నిర్మల, ఐలమ్మ, లావణ్య, అచల, యాకయ్య, ఖాజా పాల్గొన్నారు.