
రైతుకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్ ప్రావీణ్య, అరూరి రమేష్
వర్ధన్నపేట: రాష్ట్రంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గురువారం మండలంలోని ఇల్లంద శివారులోని ఓ గార్డెన్స్లో పంట నష్ట పరిహారం చెక్కులను కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి రమేశ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఏడీఎ సురేష్, ఎంపీపీ అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్ పర్సన్ ఆంగోత్ అరుణ, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్రావు, పీఏసీఎస్ చైర్మన్ రాజేష్ఖన్నా, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వామిరాయుడు, అల్లమనేని మోహన్రావు, చొప్పరి సోమలక్ష్మి సోమయ్య, రాంనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అరూరి రమేశ్