
‘తూర్పు’లో
‘హస్త’వాసి
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పు కాంగ్రెస్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే ఆరు గ్యారంటీ స్కీంలతో జనాల్లోకి వెళుతున్న ఆ పార్టీ నాయకులు ఎవరికి వారుగా టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇక్కడినుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కొండా సురేఖ గత ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసినా... ఇప్పుడు మళ్లీ వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అదే సమయంలో డీసీసీ అధ్యక్షురాలు ఎరబ్రెల్లి స్వర్ణ కూడా ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నానని, అవకాశం తనకే ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఇండియన్ ఓవర్ సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల ప్రదీప్ కొన్నేళ్లుగా సామల జయశంకర్ ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల వరంగల్ పార్లమెంట్ స్థానాలపై సమీక్షకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో తనలాంటి గట్టి నేత ఉన్న నియోజకవర్గంలోనే టికెట్పై క్లారిటీ లేకపోవడంతో జనాల్లో కన్ఫ్యూజన్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఇక్కడి స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎవరికి వారుగా ఎంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
కొండా సురేఖ, ఎరబ్రెల్లి స్వర్ణ, సామల ప్రదీప్ కుమార్ ప్రయత్నాలు
ఓవైపు రాజకీయ అనుభవం, మరోవైపు సామాజిక సేవ
కలిసొస్తుందనే లెక్కలు
ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీతో ఎవరికి వారుగా లాబీయింగ్
ఇటీవల కొండా వ్యాఖ్యలతో నియోజకవర్గంలో కన్ఫ్యూజన్పై చర్చ
సాధ్యమైనంత త్వరగా టికెట్ ఖరారు చేస్తే జనాలతో ఇంకా మమేకం

సామల ప్రదీప్


