
3 నుంచి ఇంటర్ప్రయోగ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య శనివారం వెల్లడించారు. జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థులకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రయోగ పరీక్షలు కొనసాగుతాయన్నారు. 3న వృక్షశాస్త్రం, 4న జంతు శాస్త్రం, 4, 5 తేదీల్లో భౌతిక శాస్త్రం, 5, 6న రసాయన శాస్త్రం పరీక్షలు జరుగుతాయని వివరించారు. అదేమాదిరిగా జూన్ 9, 10న ఇంగ్లీష్, 11న పర్యావరణ విద్య పరీక్ష, 12న నైతికత, మానవ విలువలు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు హాల్టిక్కెట్లను కళాశాల నుంచి లేదా ఇంటర్బోర్డు వెబ్సైట్ నుంచి పొందవచ్చని, సకాలంలో కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మైనార్టీ విద్యార్థులు జూన్ 30 సాయంత్రం 5 వరకు www.telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎండీ అఫ్జలుద్దీన్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు ప్రవేశం పొంది, కుటుంబ ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న వారికి రూ.20 లక్షల ఉపకార వేతనంతో పాటు విమాన ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ.60 వేలు చెల్లిస్తారని.. పూర్తి వివరాలకు జిల్లా కార్యాలయంలోగాని లేదా సెల్నంబర్లు 72078 54914, 08545–232500 సంప్రదించాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత జూలై, 31 సాయంత్రం 5 వరకు హార్డ్ కాపీలను జతచేసి 2 సెట్లను కలెక్టరేట్లోని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
వనపర్తి రూరల్: విధులను నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం మండలంలోని కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయన వెంట నోడల్ అధికారి డా. వంశీ, డా. రాకేష్రెడ్డి, వైద్యసిబ్బంది, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరానిలిపివేత
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నుంచి 33 కేవీ కొత్తకోట ఫీడర్ లైన్లో తీగలకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నందున ఆయా ప్రాంతాల్లో ఆదివారం విద్యుత్ సరఫరా నిలివేస్తున్నట్లు పట్టణ విద్యుత్ ఏఈ ఎస్.రాజయ్యగౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేడీఆర్నగర్, శంకర్గంజ్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి రోడ్, కొత్తకోట రోడ్, బసవన్నగడ్డ, ఐజయ్యనగర్, వెంగళరావునగర్కాలనీ, సాయినగర్కాలనీ, టీచర్స్కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, చందాపూర్ రోడ్, కర్నూలు రోడ్, సాగర్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, న్యూటౌన్ కాలనీ, జంగిడిపురం, వల్లభ్నగర్, బ్రహ్మంగారి వీధి, రాజనగరం రోడ్, నాగవరం, భగీరథ స్విమ్మింగ్ పూల్ రోడ్ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 9 వరకు విద్యుత్ సరఫరా ఉండదని.. గృహ, వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులు సహకరించాలని పేర్కొన్నారు.
3 నుంచి ‘పది’
సప్లిమెంటరీ పరీక్షలు
కందనూలు: పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కొనసాగుతాయని నాగర్కర్నూల్ జిల్లా విద్యాధికారి రమేష్కుమార్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయని, హాల్టిక్కెట్లను ఇప్పటికే విడుదల చేశామని, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకొని సకాలంలో కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు. 5 నిమిషాల వరకు అనుమతిస్తారని.. తర్వాత అనుమతి ఉండదని తెలిపారు.

3 నుంచి ఇంటర్ప్రయోగ పరీక్షలు