
జీలుగతో నేల సారవంతం
పాన్గల్: ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయంలో రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. రైతులకు 50 శాతం రాయితీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తున్నామని.. పంటల సాగుకు ముందు పొలంలో విత్తి ఏపుగా పెరిగిన తర్వాత కలియ దున్నితే నేల సారవంతమవుతుందన్నారు. జీలుగ సాగుతో కలిగే లాభాలను వ్యవసాయ అధికారులు రైతులకు వివరించాలని సూచించారు. 30 కిలోల బస్తా రాయితీ పోను రూ.2,138 చెల్లించాలన్నారు. కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ కుర్వ బాలయ్య, కాంగ్రెస్పార్టీ మండల నాయకులు మధుసూదన్రెడ్డి, రవికుమార్, రాముయాదవ్, భాస్కర్యాదవ్, బ్రహ్మయ్య, నరేందర్గౌడ్, మహేష్నాయుడు, ఏఓ రాజవర్ధన్రెడ్డి, సీఈఓ భాస్కర్గౌడ్, విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.