
ఇంటర్లో నిరాశజనక ఫలితాలు
వనపర్తి
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా వనపర్తి జిల్లాకు మరోసారి నిరాశజనక ఫలితాలే వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్కు సంబంధించి 5,293 మంది పరీక్షకు హాజరు కాగా.. 58.62 శాతంతో 3,103 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 2,578 మంది విద్యార్థులు హాజరుకాగా.. 47.67శాతంతో 1,229 మంది, బాలికలు 2,715 మంది హాజరు కాగా.. 69.02 శాతంతో 1,874 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురతో పోలిస్తే బాలికలు 21.35 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మొత్తం 4,748 మంది విద్యార్థులు హాజరు కాగా.. 67.35 శాతంతో 3,198 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 2,236 మంది హాజరు కాదా.. 58.27 శాతంతో 1,303 మంది, బాలికలు 2,512 మంది హాజరు కాగా.. 75.44శాతంతో 1,895 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 17.17 శాతం అధికంగా ఉత్తీర్ణత పొందారు. గతేడాదితో పోలిస్తే ఫస్టియర్లో 52.58 శాతంతో రాష్ట్రంలో 23వ స్థానంలో ఉన్న జిల్లా.. ఈ ఏడాది 18వ స్థానంలో నిలిచింది. సెకండియర్లో గతేడాది 64.75 శాతం ఉత్తీర్ణతతో 20వ స్థానంలో నిలవగా.. ఈ ఏడాది 22వ స్థానంలో నిలిచింది.
● మే 22వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల23 నుంచి 30వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వీటితోపాటు రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు 10లో u
ఫస్టియర్లో 18, సెకండియర్లో 22వ స్థానం
గతంతో పోల్చితే స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత
మరోసారి బాలికలదే పైచేయి