ఈదురుగాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

Apr 21 2025 12:59 AM | Updated on Apr 21 2025 12:59 AM

ఈదురు

ఈదురుగాలుల బీభత్సం

గోపాల్‌పేట/ మదనాపురం: జిల్లాలో ఆదివారం ఈదురుగాలులు, అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి గోపాల్‌పేట మండలంలో ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వీచిన భారీ గాలి, అకాల వర్షానికి తీవ్రనష్టం వాటిల్లింది. గోపాల్‌పేటలోని కోదండరామస్వామి ఆలయం వద్ద ఆరబోసిన వడ్లు, వాటిపై కప్పిన కవర్లు గాల్లోకి ఎగిరిపోయాయి. చాకల్‌పల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల మధ్యలో పిడుగుపడి మండ్ల విశ్వనాథం, బోయ రాములుకు చెందిన 25 గొర్రెలు మృత్యువాత పడగా.. ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. మృతిచెందిన గొర్రెల విలువ రూ.4 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. బుద్దారంలో చెట్టు విరిగి విద్యుత్‌ స్తంభంపై పడటంతో మూడు ముక్కలైంది. గోపాల్‌పేటలోని అంబేద్కర్‌ కాలనీలో హైమాస్ట్‌ లైట్ల పోల్‌ ఒరిగిపోయింది. మామిడి కాయలు పెద్దమొత్తంలో రాలిపోయాయి. మదనాపురం మండల కేంద్రంలోని కొత్తకోట రహదారిలో చెట్టు విరిగిపడి కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే ముందు షెడ్డు కూలిపడింది. దుప్పల్లిలో సోలార్‌ విద్యుత్‌ లైట్‌ కిందపడింది. పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లిలో అకాల వర్షానికి వరిధాన్యం తడిసిముద్దయ్యింది.

జిల్లాలోని పలు ప్రాంతాల్లో

అకాల వర్షాలు

గోపాల్‌పేట మండలంలో పిడుగుపడి 25 గొర్రెలు మృతి

ఈదురుగాలుల బీభత్సం 1
1/2

ఈదురుగాలుల బీభత్సం

ఈదురుగాలుల బీభత్సం 2
2/2

ఈదురుగాలుల బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement