వ్యాధులు ప్రబలకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

వ్యాధులు ప్రబలకుండా చూడాలి

Jul 22 2025 6:36 AM | Updated on Jul 22 2025 9:15 AM

వ్యాధులు ప్రబలకుండా చూడాలి

వ్యాధులు ప్రబలకుండా చూడాలి

సీతానగరం: గ్రామాల్లో ఆరోగ్య సర్వేలు పక్కాగా చేపట్టి ప్రజలు రోగాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు పేర్కొన్నారు. ఈ మేరకు బూర్జ గ్రామంలో నిర్వహించిన సంచార చికిత్స వైద్య శిబిరాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య తనిఖీలు, అందజేస్తున్న చికిత్స వివరాలు ఈ సందర్భంగా రికార్డుల్లో పరిశీలించారు. అనారోగ్య సమస్యలను స్పష్టంగా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ రమ్య, సీహెచ్‌ఓ గాయత్రి, 104 సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement