
జంఝావతి లిఫ్ట్ పనిచేసేలా చూడండి
పార్వతీపురం టౌన్: కొమరాడ మండలంలో గల జంఝావతి ప్రాజెక్ట్కు సంబంధించి రబ్బర్ డ్యామ్ లిఫ్ట్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వి. దాలినాయుడు, తదితరులు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికలో డీఆర్ఓ కె. హేమలతను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాలినాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో జంఝావతి సాగునీరు రైతులకు అవసరమవుతాయన్నారు. రబ్బర్డ్యామ్ లిఫ్ట్ను బాగుచేస్తే సుమారు 24,640 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ పాడవ్వడంతో కొంతకాలంగా లిఫ్ట్ పనిచేయడం లేదని చెప్పారు. రైతులకు జంఝావతి నీరు అందించడంలో కూటమి నాయకులు, అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తెలిపారు. కార్యక్రమంలో సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, పాలక రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు న్యాయం చేయండి :
కాంగ్రెస్ నాయకులు