రీసర్వే పక్కాగా నిర్వహించాలి : ఆర్‌డీవో | - | Sakshi
Sakshi News home page

రీసర్వే పక్కాగా నిర్వహించాలి : ఆర్‌డీవో

May 4 2025 8:05 AM | Updated on May 4 2025 8:05 AM

రీసర్

రీసర్వే పక్కాగా నిర్వహించాలి : ఆర్‌డీవో

చీపురుపల్లి: భూములు రీసర్వే ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని ఆర్‌డీవో జివి.సత్యవాణి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఎనిమిది మండలాల్లో పని చేస్తున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్‌వో, విలేజ్‌ సర్వేయర్లకు రీసర్వే కార్యక్రమంపై శనివారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఆమె మాట్లాడుతూ రీసర్వే నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ప్రతీ అంశాన్ని అవగాహన చేసుకోవాలన్నారు. వర్క్‌షాప్‌లో నిర్దేశించిన విధంగా గ్రామాల్లో రీసర్వే నిర్వహించాలన్నారు. ప్రధానంగా వీఆర్‌ఓలు, విలేజ్‌ సర్వేయర్లు రీసర్వేపై పూర్తి అవగాహన కల్పించుకోవాలన్నారు. రీసర్వేకు సంబంధించి ఇప్పటికే మండలాల్లో ఉన్న డిప్యూటీ తహసీల్దార్లు వారిని సమన్వయం చేసుకోవాలన్నారు.

జూన్‌ నుంచి మొక్కల పంపిణీ

డీఎఫ్‌ఓ కొండలరావు

బొండపల్లి: వనమిత్ర కేంద్రాలతో పాటు, అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో జూన్‌ నుంచి మొక్కల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్‌ఓ ఆర్‌. కొండలరావు తెలిపారు. స్థానిక వనమిత్ర కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. కేంద్రంలో ఏయే రకాల మొక్కల పెంపకం చేపడుతున్నా రో అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాదం, కానుగ, వేప, తదితర మొక్కలు ఉచితంగా కావాల్సిన చిన్న, సన్నకారు రైతులు తమ రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, భూమి పాసు పుస్తకాల జెరాక్స్‌లతో దరఖాస్తులను నర్సరీ అధికారులకు అందజేయాలని సూచించారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు, పెద్ద రైతులు తమకు కావాల్సిన మొక్కల వివరాలను సమర్పిస్తే తక్కువ ధరకు మొక్కలు అందిస్తామని చెప్పారు. వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎఫ్‌ఆర్‌ఓ ఎల్‌.సింధూ, ఫారెస్టు రేంజ్‌ అధికారి బి.అప్పలరాజు ,వనమిత్ర కేంద్రం సహాయకుడు పి.అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.

అపస్మారక స్థితిలో

గుర్తు తెలియని వ్యక్తి

రాజాం సిటీ: మండల పరిధి బొద్దాం కనకమహాలక్ష్మి కాలనీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి పడిఉండడాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. ఈ విషయాన్ని రాజాం పోలీసులకు తెలియజేయడంతో సంబంధిత ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సుమారు 60 ఏళ్ల వయసు ఉంటుందని, పచ్చ, నలుపు చారలతో టీ షర్ట్‌ ధరించాడని పోలీసులు తెలిపారు. ఎవరైనా సంబంధిత బంధువులు గుర్తిస్తే రాజాం పోలీసుస్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

కాశీలో బొద్దూరు వాసి మృతి

సంతకవిటి: మండలంలోని బొద్దూరుకు చెందిన గేదెల దామోదరరావు(55) గుండెపోటుతో కాశీలో శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి కాశీకి వెళ్లిన ఆయన గురువారం తిరుగుపయనమయ్యారు. రైలు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుందనగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. రైలు దిగి అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. సాయంత్రం కాశీలోనే దహన సంస్కారాలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రీసర్వే పక్కాగా నిర్వహించాలి : ఆర్‌డీవో1
1/4

రీసర్వే పక్కాగా నిర్వహించాలి : ఆర్‌డీవో

రీసర్వే పక్కాగా నిర్వహించాలి : ఆర్‌డీవో2
2/4

రీసర్వే పక్కాగా నిర్వహించాలి : ఆర్‌డీవో

రీసర్వే పక్కాగా నిర్వహించాలి : ఆర్‌డీవో3
3/4

రీసర్వే పక్కాగా నిర్వహించాలి : ఆర్‌డీవో

రీసర్వే పక్కాగా నిర్వహించాలి : ఆర్‌డీవో4
4/4

రీసర్వే పక్కాగా నిర్వహించాలి : ఆర్‌డీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement