
పీజీఆర్ఎస్పై ప్రత్యేక దృష్టిపెట్టాలి
విజయనగరం అర్బన్: వివిధస్థాయిల్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అందే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశించారు. లబ్ధిదారులు సంతృప్తిచెందే విధంగా ఈ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. నిర్ణీత గడుపులోగానే సమస్యలకు పరిష్కారం చూపించాలని స్పష్టం చేశారు. మంత్రుల కార్యాలయాలకు జిల్లా నుంచి అందిన దరఖాస్తులపై కలెక్టర్ తమ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. మొత్తం 10 వినతులను ఈ సందర్భంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులను తన చాంబర్కు రప్పించి, వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వారి దగ్గరున్న సంబంధిత పత్రాలను పరిశీలించారు. ఆ ఫిర్యాదులకు సంబంఽధించి రెవెన్యూ అధికారులపై ఈ సందర్భంగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి అక్కడికక్కడే పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ మురళి, డ్వామా పీడీ శారదాదేవి, సహకార అధికారి రమేష్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ ఆశయ్య, ఆర్డీఓ కీర్తి, తహసిల్దార్లు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్