పీజీఆర్‌ఎస్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి

Apr 30 2025 5:15 AM | Updated on Apr 30 2025 5:15 AM

పీజీఆర్‌ఎస్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి

పీజీఆర్‌ఎస్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి

విజయనగరం అర్బన్‌: వివిధస్థాయిల్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు అందే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దేశించారు. లబ్ధిదారులు సంతృప్తిచెందే విధంగా ఈ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. నిర్ణీత గడుపులోగానే సమస్యలకు పరిష్కారం చూపించాలని స్పష్టం చేశారు. మంత్రుల కార్యాలయాలకు జిల్లా నుంచి అందిన దరఖాస్తులపై కలెక్టర్‌ తమ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. మొత్తం 10 వినతులను ఈ సందర్భంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులను తన చాంబర్‌కు రప్పించి, వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వారి దగ్గరున్న సంబంధిత పత్రాలను పరిశీలించారు. ఆ ఫిర్యాదులకు సంబంఽధించి రెవెన్యూ అధికారులపై ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి అక్కడికక్కడే పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌ మురళి, డ్వామా పీడీ శారదాదేవి, సహకార అధికారి రమేష్‌, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ ఆశయ్య, ఆర్‌డీఓ కీర్తి, తహసిల్దార్లు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement