
జామి పీఎస్ను తనిఖీ చేసిన ఎస్పీ
విజయనగరం క్రైమ్: వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ వకుల్జిందల్ విజయనగరం సబ్ డివిజన్ పరిధి జామి పీఎస్ను మంగళవారం సందర్శించారు. స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం సీడీ ఫైల్స్, జనరల్ డైరీ, సెంట్రీ, బీట్ బుక్లను ఎస్పీ తనిఖీ చేశారు. తొలుత రిసెప్షన్ కౌంటర్ను ముందుగా తనిఖీ చేసి ఆర్సీలో సిబ్బంది నిర్వహిస్తున్న విధుల సమయాన్ని స్టేషన్హౌస్ ఆఫీసర్ జనార్దన్ను అడిగారు. స్టేషన్ మొత్తం పరిశీలించి సీసీ కెమెరాలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో ఎక్కువగా సీసీ కెమెరాల ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలని, అందుకు తగిన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. గ్రామ సందర్శన తరచూ చేయాలని పీస్ కమిటీలతో సమావేశం కావాలని చెప్పారు. తనిఖీల్లో విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్, ఎస్.కోట సీఐ అప్పలనాయుడు, జామి ఎస్సై వీరజనార్దన్, ఎస్బీ సీఐ లీలారావు ఉన్నారు.