● ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్ష | - | Sakshi
Sakshi News home page

● ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్ష

Apr 29 2025 9:53 AM | Updated on Apr 29 2025 9:53 AM

 ● ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్ష

● ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్ష

న్యాయమైన డిమాండ్‌ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక, ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రెండురోజుల పాటు చేపట్టాలన్న యూనియన్‌ పిలుపు మేరకు విజయనగరం డిపో ఎదుట సోమవారం దీక్ష శిబిరం నిర్వహించారు. రాష్ట్రంలోని 129 డిపోల ఎదుట రిలేనిరాహార దీక్షలు చేపట్టినట్టు ఎన్‌ఎంయూ జిల్లా కార్యదర్శి పీజీరాఫిల్‌ తెలిపారు. ఉద్యోగుల 38 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 1/2019 సర్క్యులర్‌ అమలు, సీలింగ్‌లేని వైద్య విధానం, పెంచిన నైట్‌ అలవెన్స్‌ల చెల్లింపు, మహిళా ఉద్యోగులకు మూడురోజుల ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని కోరారు. రిలే నిరాహార దీక్షలో బి.రమణమ్మ, సరిత, బి.ఎల్‌.వి.కుమారి, జేజేరావు, శివాజీ, కేఈరావు, ఎం.శంకరరావు పాల్గొనగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.సుజాత, ఎల్‌డీప్రసాద్‌, డిపో కార్యవర్గం, బి.రామారావు, కె.చంద్రమౌళి మద్దతు తెలిపారు. – విజయనగరం అర్బన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement