
● కార్మికుల పొట్టకొట్టొద్దు
కూటమి ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టొద్దని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని జిల్లా భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. నగరంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) శ్రీనివాసమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్మికుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని కూటమి నేతలు మర్చిపోవద్దన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్మి కె.సురేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్మి బి.రమణ, శ్రావణ్ కుమార్, సతీష్, ఎర్రిబాబు, పైడిరాజు, సత్యం, అప్పన్న, దేవుడు, తదితరులు పాల్గొన్నారు.
– విజయనగరం గంటస్తంభం