పరిశీలించి పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పరిశీలించి పరిష్కరించాలి

Apr 22 2025 1:02 AM | Updated on Apr 22 2025 1:02 AM

పరిశీలించి పరిష్కరించాలి

పరిశీలించి పరిష్కరించాలి

పార్వతీపురం రూరల్‌: జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులను, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఫిర్యాదులు వాస్తవాలైతే చట్టపరమైన చర్యలతో పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి సూచించారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కుటుంబ కలహాలు, భర్త అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, సైబర్‌ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూళ్లు, ప్రేమ పేరుతో మోసాలపై పలు అర్జీలు ఎస్పీ స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అనంతరం వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన స్టేషన్‌ సిబ్బందికి ఎస్పీ స్వయంగా ఫోన్‌ ద్వారా మాట్లాడి ఆ ఫిర్యాదులను వాటి పూర్వాపరాలను విచారణ చేసి వాస్తవాలు రుజువైనట్‌లైతే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం మొత్తం 14 ఫిర్యాదులు జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి అందాయి. కార్యక్రమంలో డీసీఆర్‌బీ ఎస్‌ఐ ఫ్రకృద్ధీన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement