
ఇదెక్కడి రాజ్యాంగం..!
చీపురుపల్లి:
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలవుతుందనేందుకు చీపురుపల్లిలో వెలుగుచూసిన ఘటనే నిలువెత్తు నిదర్శనం. సాక్షాత్తూ దేవదాయ ధర్మాదాయ శాఖకు చెందిన ఆరుగురు ఈఓలతో కూడిన అధికారుల బృందం ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు జరిగితే... పోలీసులు జేసీబీనీ సీజ్చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో విలువైన దేవదాయ భూముల్లో ఆక్రమణలు పక్కన పెట్టి సాక్షాత్తూ దేవదాయశాఖ బుక్ చేసుకున్న జేసీబీ యంత్రాన్ని పోలీసులు సీజ్ చేయడం వెనుక రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని స్థానికంగా చర్చ జరోందుకుంది. ఆ జేసీబీ యంత్రం వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తది కావడంతోనే సీజ్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పట్టాభిరామస్వామి దేవస్థానం భూముల్లో ఆక్రమణల తొలగిస్తున్న అధికారులపై స్థానిక ఎమ్మెల్యే ఫైర్ అయినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఆక్రమణలు ఎలా తొలగిస్తారని ఆగ్ర హం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పట్టాభిరామస్వామికి చెందిన భూముల్లో..
పట్టణంలోని చీపురుపల్లి–రాజాం రోడ్డులో ప్రధాన రహదారిని ఆనుకుని సర్వే నంబర్ 209/6లో పట్టాభిరామస్వామి దేవస్థానానికి చెందిన 1.53 ఎకరాల భూమి ఉంది. ఆ భూములను చాలా కాలం కిందటే ప్రస్తుత జనసేన నాయకుడు కొనుగోలు చేసి క్రయ, విక్రయాలు జరిపారు. అందులో స్థలాలు కొను గోలు చేసిన కొంతమంది నిర్మాణాలు ప్రారంభిస్తే స్థానికుల ఫిర్యాదు మేరకు గత ప్రభుత్వంలోనే నిర్మాణాలు నిలిపివేశారు. ఇటీవల కొద్ది రోజుల కిందట వైఎస్సార్సీపీకి చెందిన కొంతమంది నాయకులు పట్టాభిరామస్వామి భూములను పరిరక్షించాలని కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆరుగురు అధికారుల బృందం ఈ ఏడాది మే 26న ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టింది.
వైఎస్సార్సీపీ కార్యకర్త జేసీబీ కావడమే ..
మే 26న పట్టాభిరామస్వామి దేవస్థానం భూముల్లో ఆక్రమణల తొలగింపునకు దేవదాయశాఖ ఆధ్వర్యంలో మండలంలోని పుర్రేయవలస గ్రామానికి చెందిన కంది దుర్గారావుకు చెందిన జేసీబీ యంత్రాన్ని బుక్ చేసుకున్నారు. దీంతో అధికారుల సూచనల మేరకు జేసీబీ డ్రైవర్ దేవస్థానం భూముల్లో నిర్మాణంలో ఉన్న ఓ ఉపాధ్యాయుడి ఇంటికి చెందిన పిల్లర్లు కూల్చాడు. అదే రోజు దేవస్థానం అధికారులు జేసీబీ యజమానికి రూ.2,500 కూడా చెల్లించారు.
దేవదాయశాఖ చెప్పినా......జేసీబీ సీజ్
దేవదాయశాఖ అధికారులు బుక్ చేసుకున్నప్పటికీ ఓ ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జేసీబీ యంత్రాన్ని సీజ్ చేసి పోలీస్ క్వార్టర్స్లో ఉంచారు. తనకేం సంబంధం లేదని జేసీబీ యజమాని చెబుతున్నప్పటికీ పోలీసులు వినలేదు. అంతేకాకుండా సాక్షాత్తూ దేవదాయ ధర్మాదాయశాఖ అధికారులు పోలీస్స్టేషన్కు వెళ్లి తామే జేసీబీని బుక్ చేశామని వాంగ్మూలం ఇచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం సర్వత్రా చర్చాంశనీయమవుతోంది.
దేవదాయ శాఖాధికారుల సూచనల మేరకు ఆక్రమణలు తొలగించిన జేసీబీ డ్రైవర్
జేసీబీని సీజ్ చేసిన పోలీసులు
వైఎస్సార్సీపీ కార్యకర్తకు చెందిన జేసీబీ కావడంతోనే వేధింపులు
ఆందోళనకు సిద్ధమవుతున్న జేసీబీ డ్రైవర్ బంధువులు
నాలుగు రోజుల ముందే బందోబస్తు కోసం లేఖ..
పట్టాభిరామస్వామి దేవస్థానం భూముల్లో ఆక్రమణల తొలగింపుల నిమిత్తం మే 22న దేవదాయశాఖ ఈఓ వై.శ్రీనివాసరావు పోలీసు బందోబస్తు కోరుతూ లిఖిత పూర్వకంగా చీపురుపల్లి డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను కోరారు. అదే రోజు చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో లెటర్ రిసీవ్ చేసుకున్నట్లు సంతకంతో కూడిన అకనాలెడ్జ్మెంట్ కాపీ కూడా దేవదాయశాఖ అధికారుల వద్ద ఉంది.

ఇదెక్కడి రాజ్యాంగం..!

ఇదెక్కడి రాజ్యాంగం..!