చింతపల్లి బీచ్‌ను పరిశీలించిన జేసీ | - | Sakshi
Sakshi News home page

చింతపల్లి బీచ్‌ను పరిశీలించిన జేసీ

Jun 3 2025 6:49 AM | Updated on Jun 3 2025 6:49 AM

చింతప

చింతపల్లి బీచ్‌ను పరిశీలించిన జేసీ

పూసపాటిరేగ: మండలంలోని చింతపల్లి బీచ్‌లో ఈ నెల 6న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీచ్‌ను జేసీ సేతుమాధవన్‌ సోమవారం పరిశీలించారు. వేదిక, యోగా ప్రదర్సన స్థలాన్ని గుర్తించారు. ఆయన వెంట తహసీల్దార్‌ తాడ్డి గోవింద, ఎంపీడీఓ ఎం. రాధిక, తదితరులు ఉన్నారు.

పెరుగుతున్న మడ్డువలస నీటిమట్టం

వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి ప్రాజెక్టులోకి వచ్చే నీటి ప్రవా హం పెరిగింది. సుమారు వెయ్యి క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో 64.05 మీటర్ల మేర నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

మెస్‌ బిల్లులు పెంచండి

డీఆర్వోకు ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుల వినతి

విజయనగరం గంటస్తంభం: సంక్షేమ హాస్టల్‌లో చదువుకుంటున్న విద్యార్థులకు మెస్‌ బిల్లులు పెంచాలని, కాస్మోటిట్‌ చార్జీలు అందజేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. విజయనగరం డీఆర్వో శ్రీనివాస్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. హాస్టళ్లకు సొంత భవనాల నిర్మాణంతో పాటు వార్డెన్లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్మి పి.గౌరీ శంకర్‌, ఉపాధ్యక్షులు ఎ.సుమన్‌, గణేష్‌ పాల్గొన్నారు.

చింతపల్లి బీచ్‌ను  పరిశీలించిన జేసీ 1
1/2

చింతపల్లి బీచ్‌ను పరిశీలించిన జేసీ

చింతపల్లి బీచ్‌ను  పరిశీలించిన జేసీ 2
2/2

చింతపల్లి బీచ్‌ను పరిశీలించిన జేసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement