జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో.. విజయకేతనం | - | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో.. విజయకేతనం

Jun 3 2025 6:49 AM | Updated on Jun 3 2025 6:49 AM

జేఈఈ

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో.. విజయకేతనం

విజయనగరం అర్బన్‌:

ప్రతిష్ట్మాత్మక ఐఐటీ కళాశాలల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2025 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో ఉమ్మడి విజయనగరం జిల్లాకి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. జాతీయ స్థాయిలో వెయ్యి లోపు ర్యాంకులు 9 మంది, ఓబీసీ కేటగిరీలో 20 మంది సాధించారు. ఓబీసీ కేటగిరిలో పి.హేమసాయి సూర్య కార్తీక్‌–4, బలగ జయేంద్రనాయుడు–437, ఎస్సీ కేటగిరీలో కాట్రగడ్డ రాజ్‌కిరణ్‌– 344 ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయి/ఓబీసీ ర్యాంకర్లలో తాలాబత్తుల మనోహర్‌ (116/15), పీటీఆనంద్‌ చక్రవర్తి (118/17), అరంగి శాత్విక్‌ (278/39), పొట్నూర్‌ కార్తీక్‌ (419), కేవీ అరవింద్‌ కుమార్‌ (442), దాసరి మహతి (551/79), బి.ఈశ్వరతనూజ్‌ (617/94), అప్పల శ్రీ హర్హవర్దన్‌ (635/99), తుమ్మగంటి వెంకట విష్ణుశ్రీవత్స (672/103), వెన్ను జయదీప్‌నాయుడు (1632/282) ఉన్నారు.

రేగిడి విద్యార్థుల సత్తా

రేగిడి: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో రేగిడి మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. కొమెర గ్రామానికి చెందిన మురపాక శ్రీనిధి ఓబీసీ కేటగిరీలో 2,561వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి తండ్రి మురపాక వెంకటరమణ ఇదే మండలం లక్ష్మీపురం పాఠశాలలో ఉపాధ్యాయుడు కాగా, తల్లి గౌరీశ్వరి గృహిణి.

● తునివాడ గ్రామానికి చెందిన పల్లి శాంతిప్రియ ఆలిండియా జాతీయస్థాయి/ఓబీసీ కేటగిరీలో 1446/737 ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి వెంకటరమణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, తల్లి కుమారి గృహిణి.

బొబ్బిలి విద్యార్థుల ప్రతిభ

బొబ్బిలి: జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2025 ఫలితాల్లో బొబ్బిలి పట్టణానికి చెందిన పీటీ ఆనంద్‌ ఓపెన్‌ కేటగిరీలో 118, ఓబీసీలో 17వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడుకాగా, తల్లి అనూరాధ గృహిణి.

వంగర విద్యార్థి ప్రతిభ

వంగర: మండలంలోని బాగెంపేట గ్రామానికి చెందిన కటికి బాలాజీ సిద్ధార్ధ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో సీఆర్‌ఎల్‌–2,670, ఓబీసీ కేటగిరీలో 486 ర్యాంకు సాధించాడు. తండ్రి కటికి శివున్నాయుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా తల్లి లలితకుమారి ఓ ప్రైవేటు పాఠశాల టీచర్‌.

ఆరికతోట విద్యార్థి ప్రతిభ

రామభద్రపురం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఆరికతోట గ్రామానికి చెందిన జాగాన యోగేశ్వర్‌ జాతీ య స్థాయిలో ఓబీసీ కేటగిరీలో 40వ ర్యాంకు, జనరల్‌ కేటగిరీలో 284వ ర్యాంకు సాంధించాడు. విద్యార్థి తండ్రి సింహాచలం ఓ ప్రవేట్‌ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తుండగా, తల్లి యర్రయ్యమ్మ గృహిణి.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో.. విజయకేతనం 1
1/4

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో.. విజయకేతనం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో.. విజయకేతనం 2
2/4

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో.. విజయకేతనం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో.. విజయకేతనం 3
3/4

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో.. విజయకేతనం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో.. విజయకేతనం 4
4/4

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో.. విజయకేతనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement