
ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
విజయనగరం క్రైమ్: వారం రోజుల పాటు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. నగరంలోని న్యూపూర్ణ జంక్షన్ వద్దనున్న అగ్నిమాపక స్టేషన్ సిబ్బంది ఈ వారం రోజులు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన నష్ట నివారణ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఇదిలా ఉంటే ఆదివారం స్థానిక అగ్నిమాపక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయనగరం డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మహేంద్ర గిరి, లంకె శ్రీనివాసరావు, డాక్టర్ అరుణ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై వివరించారు. కార్యక్రమంలో ఫైర్స్టేషన్ అధికారులు సోమేశ్వరరావు, సంతోష్కుమార్, మహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.