
రైతులకువెన్నుపోటు
తగరపువలస: కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం హామీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదు. ఏటా రూ.20,000 రైతులకు అందించకపోవడంపై అన్నదాతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏడాది గడిచినా ఒక్క పైసా కూడా అందలేదని, ఇది మోసపు హామీతో తమకు వెన్నుపోటు పొడవడమేనని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందకపోగా, సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో కూడా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి, ఆ భారాన్ని రైతులపైనే మోపడం, ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను రక్షించడానికి సమీక్షలు లేకపోవడం, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసి, రైతు సహాయకులను సచివాలయాలకే పరిమితం చేయడం వంటివి రైతుల కష్టాలను మరింత పెంచాయని అంటున్నారు. చాలావరకు రైతు భరోసా కేంద్రాలు తెరచుకోవడం లేదని, కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేకపోయారని, ఆక్వా, పాడి రైతులను కూడా నిట్టనిలువుగా ముంచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో
పండగలా సేద్యం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని పండగలా మార్చిందని రైతులు గుర్తుచేసుకుం టున్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ అమలు చేశారని, కౌలు రైతులతో సహా ఏటా రూ.13,500 పెట్టుబడి సా యం నేరుగా రైతు ల ఖాతాలకు బది లీ చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 24,925 మంది రైతులకు ఐదేళ్లలో రూ.112.62 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయితీలో రైతు భరోసా కేంద్రాలను సొంత భవనాలలో ఏర్పాటు చేసి, నకిలీ విత్తనాలు, ఎరువుల నివారణకు సాగు సీజన్కు ముందే కియోస్క్ల ద్వారా విత్తనాలు, డీఏపీ, యూరియా అందుబాటులో ఉంచేవారని గుర్తుచేసుకున్నారు. రైతు సహాయకులను నియమించి, వారి ద్వారా మట్టి నమూనా పరీక్షలు, సాగు చేయవలసిన పంటలు, తెగుళ్ల నివారణ, పండిన పంటకు మద్దతు ధర ప్రకటించడంతో పాటు గోనె పట్టాలు, రవాణా సౌకర్యం కల్పించారని తెలిపారు. భీమిలిలో డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షించడంతో పాటు, పశువులలో తలెత్తే రోగాల నిర్ధారణ, చికిత్స కూడా అందించేవారని వివరించారు. అతివృష్టి, అనావృష్టి సమయంలో రైతు నష్టపోకుండా ఉచిత పంటల బీమా పథకం ద్వారా భరోసా కల్పించారని, వైఎస్సార్ జలకళ కింద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేశారని అన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రాష్ట్ర రైతులకు అండగా నిలిచారని, ఆ ఐదేళ్లు బ్యాంకులు కూడా రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడంతో పాటు వాయిదాలు ఆలస్యం అయినా వేధించేవారు కాదని రైతులు తెలిపారు. ప్రజాప్రతినిధులను గడప గడపకు పంపించి, ఏ కారణం చేత అయినా సాయం అందకపోతే తక్షణం అందేలా చర్యలు తీసుకునేవారని అన్నారు.
కూటమి వచ్చాక అప్పులపాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సహాయ కార్యక్రమాలు నిలిచిపోయాయని, దీంతో గత ఏడాది రైతులు అప్పుల పాలయ్యారని, ప్రస్తుతం సీజన్ ప్రారంభం కానున్నందున అధిక వడ్డీల బాధ ఉన్నా అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాత వెన్ను విరిచిన
కూటమి ప్రభుత్వం
అటకెక్కిన ‘అన్నదాత సుఖీభవ’
భరోసా కల్పించని ప్రభుత్వంపై
రైతుల ఆగ్రహం
జిల్లాలో సాగు భూమి 4,454 హెక్టార్లు, అందులో 78 హెక్టార్లు మెట్ట్ట భూమి,
రైతు భరోసా కేంద్రాలు 57(భీమిలి 13, ఆనందపురం 18,పద్మనాభం 16, పెందుర్తి 10)
కౌలు రైతులు 504
మొత్తం రైతులు 22,569

రైతులకువెన్నుపోటు