
వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సన్నద్ధం
కౌన్సిల్ సమావేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు జీవీఎంసీలోని వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బానాల సత్య శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కుంటుపడిన అభివృద్ధి పనులు, ముఖ్యంగా పూర్తిస్థాయి కమిషనర్ను నియమించని కూటమి ప్రభుత్వ తీరుపై నగర ప్రజల తరఫున కౌన్సిల్లో చర్చించేందుకు సిద్ధమయ్యారు.