వైశ్యరాజు జ్యూయలర్స్‌ షోరూమ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వైశ్యరాజు జ్యూయలర్స్‌ షోరూమ్‌ ప్రారంభం

Jun 3 2025 6:48 AM | Updated on Jun 3 2025 6:48 AM

వైశ్యరాజు జ్యూయలర్స్‌ షోరూమ్‌ ప్రారంభం

వైశ్యరాజు జ్యూయలర్స్‌ షోరూమ్‌ ప్రారంభం

పీఎం పాలెం: స్థానిక కారుషెడ్‌ కూడలికి సమీపంలో వైశ్యరాజు జ్యూయలర్స్‌ తమ కొత్త భారీ షోరూమ్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. కొవ్వూరి పుండరీకాక్ష రెడ్డి రిబ్బన్‌ కట్‌ చేసి షోరూమ్‌ను ప్రారంభించగా, జామి భోగరాజు మొదటి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వైశ్యరాజు జ్యూయలర్స్‌ ఎండీ వైశ్యరాజు భద్రగిరి రాజు మాట్లాడుతూ పీఎం పాలెం, మధురవాడ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, ఆధునిక డిజైన్లలో బంగారు ఆభరణాలను అందించడానికి కారుషెడ్‌ మెయిన్‌ రోడ్డులో ఈ భారీ షోరూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అన్ని రకాల 22కే బంగారు ఆభరణాలపై 6శాతం తరుగు మాత్రమే వసూలు చేస్తామని, ఈ ఆఫర్‌ నగదు/యూపీఐ/ఈ–ట్రాన్స్‌ఫర్‌ చెల్లింపులకు వర్తిస్తుందన్నారు. సాధారణ వెండి వస్తువులపై తరుగు, మజూరీ, జీఎస్టీ ఉండవన్నారు. కిలో వెండి వస్తువుల కొనుగోలుపై రూ. 12,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్‌లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రగిరి రాజు కోరారు. కార్యక్రమంలో వైశ్యరాజు జ్యూయలర్స్‌ చైర్మన్‌ వైశ్యరాజు ఫల్గుణరాజు, సంస్థ డైరెక్టర్లు సురేష్‌, కిరణ్‌ కుమార్‌ రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement