
వైశ్యరాజు జ్యూయలర్స్ షోరూమ్ ప్రారంభం
పీఎం పాలెం: స్థానిక కారుషెడ్ కూడలికి సమీపంలో వైశ్యరాజు జ్యూయలర్స్ తమ కొత్త భారీ షోరూమ్ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. కొవ్వూరి పుండరీకాక్ష రెడ్డి రిబ్బన్ కట్ చేసి షోరూమ్ను ప్రారంభించగా, జామి భోగరాజు మొదటి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వైశ్యరాజు జ్యూయలర్స్ ఎండీ వైశ్యరాజు భద్రగిరి రాజు మాట్లాడుతూ పీఎం పాలెం, మధురవాడ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, ఆధునిక డిజైన్లలో బంగారు ఆభరణాలను అందించడానికి కారుషెడ్ మెయిన్ రోడ్డులో ఈ భారీ షోరూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అన్ని రకాల 22కే బంగారు ఆభరణాలపై 6శాతం తరుగు మాత్రమే వసూలు చేస్తామని, ఈ ఆఫర్ నగదు/యూపీఐ/ఈ–ట్రాన్స్ఫర్ చెల్లింపులకు వర్తిస్తుందన్నారు. సాధారణ వెండి వస్తువులపై తరుగు, మజూరీ, జీఎస్టీ ఉండవన్నారు. కిలో వెండి వస్తువుల కొనుగోలుపై రూ. 12,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రగిరి రాజు కోరారు. కార్యక్రమంలో వైశ్యరాజు జ్యూయలర్స్ చైర్మన్ వైశ్యరాజు ఫల్గుణరాజు, సంస్థ డైరెక్టర్లు సురేష్, కిరణ్ కుమార్ రాజు పాల్గొన్నారు.