
మోసాలను ఎండగడతాం..
వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మోసాలను ఎండగడతామని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు.