నిరసనలతో హోరెత్తుతున్న విశాఖ | - | Sakshi
Sakshi News home page

నిరసనలతో హోరెత్తుతున్న విశాఖ

Jun 4 2025 2:20 AM | Updated on Jun 4 2025 2:20 AM

నిరసన

నిరసనలతో హోరెత్తుతున్న విశాఖ

బుధవారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2025

లా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వేలాది మంది జీవనాధారాన్ని కోల్పోయారు. కుటుంబాలతో రోడ్డున పడ్డారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలతో అరచేతిలో స్వర్గాన్ని చూపించారు. ఇప్పుడు చేతిలో ఉన్న ఉపాధిని సైతం దూరం చేశారు. వలంటీర్లకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తామని నోట్లో బూర్లు వండేశారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేసి 11,122 మంది నోట్లో మట్టి కొట్టారు. రైస్‌ కార్డుదారులకు మరిన్ని నిత్యావసరాలు పంపిణీ చేస్తామని మభ్య పెట్టారు. ఇప్పుడు ఇంటింటి రేషన్‌ విధానానికి స్వస్తి చెప్పి పేదలను కిలోమీటర్లు నడిపించి, గంటల తరబడి క్యూలో నిలబెట్టి అష్టకష్టాలు పెడుతున్నారు. సంపద సృష్టిస్తామని డబ్బా కొట్టి.. ఇప్పుడు విద్యుత్‌ ఛార్జీలు, భూముల ధరలు పెంచి సుమారు రూ.250 కోట్ల భారం మోపి నగర ప్రజల నడ్డివిరిచారు. విశాఖకు ఐటీ పెట్టుబడులు తీసుకొస్తామని కబుర్లు చెప్పి.. ఊరూపేరూ లేని ఉర్సా కంపెనీకి రూ.వందల కోట్లు విలువ చేసే భూములను ధారాదత్తం చేశారు. సూపర్‌ సిక్స్‌ హామీలు గాలికొదిలేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు, అభిమానులు, సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతూ.. కక్ష సాధిస్తూ.. పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో బాబు ష్యూరిటీ.. వెన్నుపోటు గ్యారెంటీ అని చంద్రబాబు మరోసారి నిరూపించారు.

–విశాఖ సిటీ

సూపర్‌ సిక్స్‌ పేరుతో బూటకపు హామీలు గుప్పించి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి ఖజానా ఖాళీ అయిపోయిందని కుంటి సాకులు చెబుతున్నారు. స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని విద్యార్థులను మోసం చేశారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని, ఉచిత బస్సు ప్రయాణమని మాయమాటలు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి అన్నదాతకు వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌, పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏలు అన్నీ ఇస్తామని చెప్పి బుట్టలో వేసుకుని ఇప్పుడు నిలువునా ముంచారు. ఇలా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరికీ పంగనామాలు పెట్టారు.

‘ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా పోరాడతాం’ అని ఎన్నికలకు ముందు చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక పత్తా లేకుండా పోయారు. ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం నెమ్మదిగా ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ పేరుతో ఇంటికి పంపిస్తోంది. కాంట్రాక్టు కార్మికులపై వేటు వేసింది. దీంతో వేలాది మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత ఏడాది కాలంగా కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌గానీ వారి గోడును పట్టించుకున్న దాఖలాలు లేవు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు నిరసనలు చేపడుతుంటే.. వారి ఆందోళనలను అణిచివేయడానికి పోలీసులను ప్రయోగిస్తుండడం గమనార్హం.

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వలంటీర్లు, 108 ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లు, ఆశా కార్యకర్తల ధర్నాలు, నిరసనలతో విశాఖ హోరెత్తిపోతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుకు, సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న ధర్నాలతో దద్దరిల్లుతోంది. ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగులు.. విధుల్లోకి తీసుకొని రూ.10 వేలు వేతనం ఇవ్వాలని వలంటీర్లు.. సమస్యలు పరిష్కరించాలంటూ ఆశ వర్కర్ల నిరసనలు.. ఆకలి కేకలతో అలమటిస్తూ పెండింగ్‌ జీతాల కోసం ఆయాల పొలికేకలు.. ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో రోడ్డున పడ్డ 702 మంది ఆపరేటర్లు, హెల్పర్ల ఆర్తనాదాలు.. ఇలా చంద్రబాబు ఏడాది పాలనలోనే అన్ని వర్గాల నుంచి అసహనం కట్టలు తెంచుకుంటోంది.

దౌర్జన్యాలు.. బెదిరింపులు

ఐటీ, పర్యాటక రాజధాని పేరుతో మోసం

వలంటీర్ల నిరసన(ఫైల్‌)

పత్తా లేకుండా పోయిన పవన్‌ కల్యాణ్‌

సూపర్‌ సిక్స్‌ హామీలకు మంగళం

నా

నిరసనలతో హోరెత్తుతున్న విశాఖ1
1/4

నిరసనలతో హోరెత్తుతున్న విశాఖ

నిరసనలతో హోరెత్తుతున్న విశాఖ2
2/4

నిరసనలతో హోరెత్తుతున్న విశాఖ

నిరసనలతో హోరెత్తుతున్న విశాఖ3
3/4

నిరసనలతో హోరెత్తుతున్న విశాఖ

నిరసనలతో హోరెత్తుతున్న విశాఖ4
4/4

నిరసనలతో హోరెత్తుతున్న విశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement