
అడ్వాన్స్డ్లో శశి ముందంజ
తగరపువలస: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ సంగివలస క్యాంపస్ విద్యార్థులు ముందంజలో నిలిచారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ తెలిపారు. వివిధ కేటగిరీల్లో షేక్ ఆజాం ఖాన్ 16వ ర్యాంకు, పాకలపాటి హర్షవర్థన్ 124, దండె స్టీఫెన్ 169, నిడిగట్టు తేజశ్రీ 339, బొడ్డేడ బాల అనిక్ 396, పడాల లిఖిత్ కృష్ణ 928, పొన్నపు స్వరూప 930వ ర్యాంకులు సాధించారన్నారు. 1000లోపు ఏడుగురు, 2వేల లోపు 14, 5వేల లోపు 33, 10వేల లోపు 59 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారన్నారు. ర్యాంకర్లను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా క్రాంతి సుధ అభినందించారు.

అడ్వాన్స్డ్లో శశి ముందంజ

అడ్వాన్స్డ్లో శశి ముందంజ