చదువు దూరం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

చదువు దూరం చేయొద్దు

Jun 2 2025 1:31 AM | Updated on Jun 2 2025 1:31 AM

చదువు దూరం చేయొద్దు

చదువు దూరం చేయొద్దు

కోటవురట్ల: అయ్యా విద్యా శాఖామంత్రి లోకేష్‌ గారూ.. మా పిల్లలకు చదువులు అవసరం లేదా..గిరిజన పిల్లలు చదువుకు దూరంకావలసిందేనా..ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు... మా పిల్లల కోసం ఓ ఉపాధ్యాయుడిని నియమించలేరా అంటూ అణుకు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తూ దండం పెడుతూ ఆందోళన చేశారు. అణుకు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆదివారం ఆందోళన చేశారు. ప్రత్యామ్నాయ పాఠశాలను తెరిచి ఉపాధ్యాయుడిని నియమించాలని నినాదాలు చేశారు. పార్టీ మండల కార్యదర్శి ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ గొట్టివాడ శివారు గ్రామం అణుకు గిరిజన గ్రామంపై చిన్నచూపు తగదన్నారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, గత ప్రభుత్వంలో గిరిజనుల పోరాటంతో రోడ్డు వేసి, ప్రత్యామ్నాయ పాఠశాలకు ఉపాధ్యాయుడిని కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయుడుని తొలగించారని, దీంతో చిన్నారులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ సుమారు 60 మంది పిల్లలు ఉన్నారని, అందుకు తగ్గట్టుగా పాఠశాలను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం వర్షాలకు రోడ్డు కూడా శిథిలమైందని, పిల్లలు రాళ్లు తేలిన రోడ్డుపై చదువు కోసం 12 కిలోమీటర్లు రానుపోను నడవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement