
రాంగ్ రూట్లో రిస్క్ జర్నీ!
జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదురుగారహదారికి మధ్య డివైడర్లు ఏర్పాటు చేశారు. దీంతో జైలురోడ్డు నుంచి జీవీఎంసీ మీదుగా రామ్నగర్ వెళ్లాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్(సీఎంఆర్ బస్టాప్) వరకు ప్రయాణించాలి. అటువైపు నుంచి ఆర్టీసీకి కాంప్లెక్స్ వైపు రావాల్సిన వారు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సిగ్నల్ పాయింట్ వద్ద యూటర్న్ తీసుకోవాలి. ఈ అదనపు ప్రయాసను తప్పించుకునేందుకు కొందరు వాహనచోదకులు ప్రమాదకరమైన దారిని ఎంచుకుంటున్నారు. రాంగ్ రూట్లో అండర్ పాత్ వేలోకి వెళ్లి.. యూటర్న్ తీసుకుంటున్నారు. ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా.. ప్రమాదాలు జరిగే ఆస్కారం పెరుగుతోంది. అయినప్పటికీ కొంత మంది వాహనచోదకులు ఇష్టానుసారంగారాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం